పోస్ట్లు
2020లోని పోస్ట్లను చూపుతోంది
ఉదయ భాస్కర్, శ్రీరాములు చౌదరి సంస్మరణార్థం పేదలకు అన్నదానం
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
ప్రముఖ కళాకారులు బొట్టా ఉదయభాస్కర్, మేడికొండ శ్రీరాములు చౌదరి సంస్మరణార్ధం నేడు హనుమంతరాయ గ్రంథాలయం వద్ద 100 మంది పేదలకు ఆహార ప్యాకెట్ల ద్వారా అన్నదానం జరిగింది. ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన ఇస్కఫ్ జాతీయ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కె సుబ్బరాజు మాట్లాడుతూ సుప్రసిద్ధ నటునిగా, దర్శకునిగా నాటకరంగంలో బొట్టా ఉదయభాస్కర్ కళాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, అత్యధిక సమయాన్ని కళారంగానికి కేటాయించేవారన్నారు. కళాకారునిగా, కళాభిమాని గా, ప్రగతిశీల రచయితగా, హనుమంతరాయ గ్రంథాలయ కార్యదర్శిగా మేడికొండ శ్రీరాములు చౌదరి బహుముఖ సేవలు అందించారని కే సుబ్బరాజు పేర్కొంటూ విజయవాడ కళారంగంలో వీరిరువురిది ప్రత్యేక శైలి అని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన గ్రంధాలయ సత్యం మాట్లాడుతూ వీరిరువురి తో తనకు గల ప్రత్యేక అనుబంధం రీత్యా తనకు తానే అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేస్తూ ఉదయభాస్కర్, శ్రీరాములు చౌదరి సేవలు మరుపురానివని అన్నారు.
కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
విజయవాడ : లాక్ డౌన్ అమలులో ఉన్న మే 3 వరకు నిబంధనలు కచ్చితంగా పాటిద్దాం. అత్యవసరం అయితే తప్ప ఇంటినుంచి బయటకు రాకుండా ఉందాం.. మాస్క్ తప్పనిసరి చేద్దాం. విజయవాడ లో లాక్ డౌన్ అమలు బాగా ఉన్నా మరెన్నో చోట్ల ఉల్లంఘనలకు గురవుతున్నది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మనందరం మరింత కఠినంగా నిబంధనలు పాటించాల్సి ఉంది. ఈ తరుణంలో ఉల్లంఘన విచారకరం. పరిస్థితి తీవ్రతను అందరూ గమనించాలి. విధుల్లో ఉన్న వైద్యులకు ప్రభుత్వం సౌకర్యాలు మరింత మెరుగు పరచాలి. నిజానికి వైద్యులు , పోలీసులు , పారిశుద్ధ్య పనివారి సేవలు అభినందనీయం. ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న త్యాగానికి మంచి ఫలితాలు లభించాలంటే మనందరం వారికి సహకరించాలి. ఏ లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ రావడానికి గల కారణాలు ఏమిటో కనిపెట్టాలి. ఏమాత్రం అనుమానం ఉన్నా వారందరికీ పరీక్షలు నిర్వహించాలి. నిర్వాసితులకు ఆశ్రయం కల్పించి ఆహార పానీయాలు సమకూరుస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలి. అలాగే అందరికి రేషన్ అందిస్తున్నందుకు కూడా.... పేదలకు, మధ్య తరగతి వారికి ,కూరగాయలు వగైరాలు అందజేస్తున్న సేవా సంస్థ